Balwant singh rajona: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి హత్యకేసు దోషికి ఊరట

  • 1995లో చండీగడ్ సచివాలయం వద్ద భారీ పేలుడు
  • బియాంత్‌సింగ్ సహా 17 మంది మృతి
  • 2007లో బల్వంత్‌సింగ్‌కు మరణశిక్ష
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్యకేసులో దోషి బల్వంత్‌సింగ్ రాజోనాకు ఊరట లభించింది. ఆగస్టు 31, 1995లో చండీగఢ్ సచివాలయం ఎదుట జరిగిన భారీ పేలుడులో బియాంత్‌సింగ్ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దోషిగా తేలిన బల్వంత్‌సింగ్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా, కేంద్ర హోంశాఖ అతడి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Balwant singh rajona
punjab
Beant singh
death sentence

More Telugu News