Hyderabad: ఎంఎంటీఎస్-హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్ ఢీ ఘటన.. ఎంఎంటీఎస్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన

  • 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు
  • రోజుకు 121 సర్వీసులు
  • ప్రతి రోజు 1.60 లక్షల మంది రాకపోకలు

హైదరాబాద్ నగర ప్రజలకు అనువుగా ఉండేలా, అతి తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో 16 ఏళ్ల క్రితం ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దంన్నర కాలంలో కొన్ని కోట్ల మందిని ఎంఎంటీఎస్ తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం రోజుకు 121 సర్వీసులు నడుస్తున్నాయి. నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2003లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు 1.60 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో, ఎంఎంటీఎస్ 16 ఏళ్ల చరిత్రలో నిన్న జరిగిన ప్రమాదమే అతి పెద్ద దుర్ఘటన అని అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైలు.. కర్నూలు వెళ్లడానికి సిద్ధంగా వున్న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్‌ను 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News