Rajani: 'దర్బార్' కోసం ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి కారణమదేనట

  • రజనీ కథానాయకుడిగా 'దర్బార్'
  • 130 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • దేశ విదేశాల్లో భారీస్థాయి రిలీజ్ 

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ 'దర్బార్' సినిమాను రూపొందించాడు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. రజనీకాంత్ క్రేజ్ కి తగినట్టుగానే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారట. పోలీస్ ఆఫీసర్ గా రజనీ నటించిన ఈ సినిమా కోసం 130 కోట్ల వరకూ ఖర్చు చేశారట.

రజనీ పారితోషికం కాకుండానే లైకా ప్రొడక్షన్స్ వారు ఈ మొత్తం ఖర్చు చేయడం విశేషం. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇతర దేశాల్లోను రజనీ అభిమానులు ఉండటం వలన, అక్కడ కూడా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దేశ విదేశాల్లో రజనీకి గల ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకునే లైకా వారు ఈ స్థాయిలో ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు.

More Telugu News