మరో ఇద్దరి ప్రాణాలు తీసినట్టు సీరియల్ కిల్లర్ సింహాద్రిపై బంధువుల ఫిర్యాదు
- గోదావరి జిల్లాల్లో రెండు కేసుల నమోదు
- ఏలూరులో ఒకరిని, పురుషోత్తపట్నంలో ఒకరిని చంపినట్టు కేసు
- ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సింహాద్రి
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒకరిని, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో మరొకరిని హత్య చేసినట్లు మృతుల బంధువులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇతని చేతిలో చనిపోయిన చోడవరపు సూర్యనారాయణకు సంబంధించి ఏలూరు పోలీసులకు ఫిర్యాదు అందగా, పురుషోత్తపట్నంలో రామకృష్ణ స్వామీజీ హత్యకు సంబంధించి సీతానగరం పోలీసులకు ఫిర్యాదు అందింది.