Visakhapatnam District: మునిగిపోతున్న వ్యక్తి కోసం యూనిఫాం విప్పేసి నీళ్లలో దూకిన ఎస్సై

  • విశాఖ జిల్లాలో ఘటన
  • మునిగిపోతున్న గజ ఈతగాడి కోసం ఎస్సై సాహసం
  • ఎస్సైకి అభినందనలు

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పెద్దేరు జలాశయంలో ఓ మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ గజ ఈతగాడ్ని పిలిపించి ఆ మృతదేహాన్ని వెలికి తీయించాలని పోలీసులు భావించారు. అయితే నీళ్లలో దిగిన ఆ గజ ఈతగాడు కాసేపటికే మునిగిపోవడం ప్రారంభించాడు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుండడంతో అక్కడే ఉన్న మాడుగుల ఎస్సై రామారావు యూనిఫాం విప్పేసి నీళ్లలోకి దూకేశారు. ఆ గజ ఈతగాడ్ని ప్రాణాలతో బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ఎస్సై రామారావు హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. పోలీసు సహచరులే కాకుండా, స్థానిక ప్రజలు కూడా ఎస్సై సాహసాన్ని అభినందించారు.

More Telugu News