madyapradesh: మత్తుమందిచ్చి కూతురిపైనే ఏడాదిగా అత్యాచారం!

  • భర్త తీరు నచ్చక పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • తండ్రితో కలిసి ఉంటున్న ముగ్గురు కుమార్తెలు
  • కంటికి రెప్పలా కాపాడిల్సింది పోయి కామాంధుడయ్యాడు

అతనో మానవ మృగం. ఈ మాట కూడా చిన్నదే అవుతుందేమో. బిడ్డల కోసం సర్వస్వం ధారపోసేందుకు సిద్ధపడతారు తల్లిదండ్రులు. ఆ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అహరహం శ్రమిస్తారు. కానీ అతను తాను తండ్రినని, తనకు బాధ్యత ఉందని మర్చిపోయి కన్నకూతురిపైనే ఏడాదిగా అత్యాచారం చేస్తూ సభ్యసమాజం తదించుకునేలా చేశాడు.

వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. భర్త ప్రవర్తన నచ్చక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు కూతుర్లతో కలిసి ఇతను ఉండేవాడు.

భార్య దూరం కావడంతో తన కామవాంఛ తీర్చుకునేందుకు ఇతని దృష్టి పెద్దకుమార్తెపై పడింది. రోజూ రాత్రుళ్లు ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉండగా అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అకృత్యానికి పాల్పడుతూ దాన్ని వీడియో తీసి మిగిలిన ఇద్దరి పిల్లలకూ చూపిస్తూ వారినీ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో తండ్రిని చూస్తే రాక్షసుడిని చూసినట్టు కుమార్తెలు వణికిపోయేవారు.

ఈ నేపథ్యంలో ఇతని మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఓ సందర్భంలో ఇంటి యజమానురాలు ఆమె తండ్రి గురించి అడిగితే భయంతో వణికిపోయింది. తండ్రి పేరు చెబితే అంతగా భయపడుతుండడంతో అనుమానం వచ్చిన యజమానురాలు ఆరాతీస్తే అసలు నిజం చెప్పడంతో ఆమె అవాక్కయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి ఆమె చెప్పిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.

More Telugu News