Nara Lokesh: రివర్స్, రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరికి చిప్ప మిగిల్చేట్టుంది: నారా లోకేశ్

  • ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు
  • ఆదా చేశాం అని చెప్పుకుంటూ ఖర్చు పెంచేశారని ఆరోపణ
  • ప్రతిదానికీ రివర్స్ అంటున్నారని అసహనం

ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రతిదానికీ రివర్స్, రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరికి చిప్ప మిగిల్చేట్టు ఉందని విమర్శించారు. ఓవైపు రూ.628 కోట్లు ఆదా చేశాం అని చెప్పుకుంటూనే, మరోవైపు ఇసుక ఖర్చు పెరిగిందని రూ.500 కోట్లు చెల్లించడం చూస్తుంటే డిప్ప గొరిగి విగ్గు పెట్టి మళ్లీ గొరిగినట్టుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ కు జోడించారు.

More Telugu News