ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై జగన్ సీరియస్.. జీవో రద్దుకు ఆదేశాలు!
- తనను సంప్రదించకుండానే పేరు మార్చడంపై ఆగ్రహం
- జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ ఆదేశం
- అబ్దుల్ కలాం పేరును కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ
ఈ నేపథ్యంలో, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. తనను సంప్రదించకుండానే పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరునే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రాం, పూలే పేర్లతో కూడా అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.