India: ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్... తొలి టి20లో భారత్ ఓటమి

  • ఢిల్లీ టి20లో 7 వికెట్ల తేడాతో బంగ్లా విజయం
  • 60 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్
  • సిక్స్ తో జట్టును గెలిపించిన మహ్మదుల్లా

ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. షకీబల్, తమీమ్ ల గైర్హాజరీతో బలహీనపడిందనుకున్న బంగ్లాదేశ్ జట్టు అనూహ్యరీతిలో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేయగా, మరో మూడు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ విజయతీరాలకు చేరింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్ తో అలరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 20వ ఓవర్లో మూడో బంతికి తాత్కాలిక సారథి మహ్మదుల్లా సిక్స్ కొట్టడంతో బంగ్లా విజయం సాధించింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది.

More Telugu News