India: ఢిల్లీ టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందు 149 పరుగుల టార్గెట్ ఉంచిన భారత్

  • ఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్ మధ్య టి20 మ్యాచ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసిన భారత్
  • 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి ముందు 149 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య సిక్సర్లు బాదుతూ వేగంగా ఆడారు. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లామ్, అమినుల్ ఇస్లామ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ ను దీపక్ చహర్ పడగొట్టాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.
India
Bangladesh
New Delhi
T20

More Telugu News