RTC: మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాదులో సకలజనుల సమరభేరి సభ

  • సరూర్ నగర్ స్టేడియంలో సకలజనుల సభ
  • సాయంత్రం 6 గంటలకు సభను ముగించాలన్న హైకోర్టు
  • సభకు 5 లక్షల మంది హాజరుకానున్నట్టు సమాచారం

ఈ మధ్యాహ్నం హైదరాబాదు సరూర్ నగర్ లోని స్టేడియంలో ఆర్టీసీ జేఏసీ సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. తొలుత ఈ సభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవడంతో ఆర్టీసీ కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, సభను ఏర్పాటు చేసుకోవడానికి హైకోర్టు అనుమతించింది. అయితే, 3 గంటల నుంచి 6 గంటల వరకే సభను నిర్వహించాలని... రాత్రి 7 గంటలకల్లా సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని షరతు విధించింది. మరోవైపు ఈ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నట్టు సమాచారం. జేఏసీ నేతలకు పోలీసులు కూడా ఓ కండిషన్ పెట్టారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని షరతు విధించారు.

More Telugu News