ఏపీ నుంచి ఒక్క ఇసుక లారీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదు: సీఎం జగన్
- పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి పహరా ఉండాలని ఆదేశం
- వరదల కారణంగా ఇసుక తీయలేకపోతున్నామని వెల్లడి
- త్వరలో ఇసుక వారోత్సవం
అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లకు, ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని వెల్లడించారు. ఇసుక తవ్వకాలు, పంపిణీలో అవినీతిని నిర్మూలించామని నేడు గర్వంగా చెప్పగలమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు వస్తున్నాయని తెలిపిన సీఎం జగన్, వరదల కారణంగా ఆశించిన రీతిలో ఇసుకను తీయలేకపోతున్నామని వివరణ ఇచ్చారు.
అయితే, ఇసుక విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మరో వారం రోజుల్లో వరదలు తగ్గుముఖం పడుతాయని భావిస్తున్నామని, రాష్ట్రంలో ఇసుక వారోత్సవం అనే కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. వారం రోజుల పాటు ఇసుక అంశం మీదే పనిచేద్దామంటూ అధికారులకు ఉద్బోధించారు.