YSRCP: ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలంటూ ఆహ్వానం వచ్చింది: పురందేశ్వరి

  • ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదు
  • నేను వైసీపీలో చేరబోనని ఆ పార్టీ నేతలకు నా భర్త ఇప్పటికే తెలిపారు
  • బీజేపీలోనే కొనసాగుతానని నా భర్త స్పష్టం చేశారు 

బీజేపీ నాయకురాలు పురందేశ్వరిని తమ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె మాట్లాడుతూ... గత ఎన్నికల ముందు వైసీపీలో చేరాలని తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదని చెప్పారు.

'నా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడానికి ముందే నేను ఆ పార్టీలో చేరబోనని వారికి తెలిపారు' అని పురందేశ్వరి చెప్పారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని తన భర్త స్పష్టంగా వైసీపీకి చెప్పారని వివరించారు. దీనికి వైసీపీ నేతలు అంగీకరించిన అనంతరమే తన భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరారని వివరించారు.

More Telugu News