Rajinikanth: ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను: రజనీ కాంత్

  • శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సుజిత్
  • బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సహాయక సిబ్బంది 
  • వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రజనీ సూచన

తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా, నాడుకట్టుపల్లిలో మూడేళ్ల చిన్నారి సుజిత్ విల్సన్ బోరుబావిలో పడిన విషయంపై సినీనటుడు రజనీ కాంత్ స్పందించారు. ఆ చిన్నారి క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అతడిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక సిబ్బంది.. యంత్రాల సాయంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తాను సూచిస్తున్నట్లు చెప్పారు.

కాగా, శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిన అతడిని బయటకు తీసేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఆ బాలుడు తన ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

More Telugu News