Jail: బెడ్ షీటే తాడు... జైలు నుంచి ఖైదీల పరార్!

  • చత్తీస్ గఢ్ ముంగేలీ జిల్లాలో ఘటన
  • నలుగురు ఖైదీల పరారీ
  • జైలు సిబ్బంది హస్తంపై పోలీసుల విచారణ

తమ వద్ద ఉన్న బెడ్ షీట్ నే తాడుగా మార్చుకున్న ఖైదీలు, జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన చత్తీస్‌ గఢ్‌ లోని ముంగేలీ జిల్లాలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి సబ్ జైలులోని నలుగురు ఖైదీలు పక్కా ప్లాన్‌ వేసుకున్నారు. తాముండే బ్యారక్ తాళం పగలగొట్టారు. ఆపై గదిలో ఉన్న బెడ్ షీట్‌ ను తాడులా పేనారు. దాని సాయంతో సుమారు 20 అడుగుల ఎత్తున్న గోడ దూకి, జైలు నుంచి పారిపోయారు. జరిగిన ఘటనపై జైలు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరంతా హత్య, దొంగతనం కేసుల్లో అరెస్ట్ అయ్యారని పోలీసుల తెలిపారు. వీరు పారిపోవడం వెను జైలు సిబ్బంది హస్తం ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News