ఇరు దేశాలు కోరితేనే ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారు: అమెరికా
- ఇతరుల జోక్యాన్ని భారత్ కోరుకోవడం లేదు
- చర్చలకు కావాల్సిన వాతావరణం కోసం కృషి చేస్తున్నాం
- చర్చలకు అడ్డంకిగా పాక్ ఉగ్రవాదం
చర్చలకు అడ్డంకిగా ఉన్న ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని, భారత్ తో చర్చలకు కావాల్సిన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆయన అన్నారు. ఇటీవల కర్తార్ పూర్ నడవాపై జరిగిన ఒప్పందం స్వాగతించదగిన పరిణామమని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు అమెరికా సహకరిస్తుందన్నారు. తమ దేశాధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాల ప్రధానులతో విడివిడిగా ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపారని తెలిపారు.