Asaduddin Owaisi: ఇప్పటికైనా అర్థమైందా? ప్రతిసారీ అలానే గెలుస్తామంటే కుదరదు: బీజేపీకి ఒవైసీ చురక

  • హర్యానాలో మోదీ 15 సార్లు ప్రచారం చేసినా ఫలితం నిల్
  • ఎప్పటికీ మోదీ హవా పనిచేయదు
  • ఇకనైనా ఆర్థిక రంగంపై దృష్టిపెట్టండి

తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ కూడా తగ్గిందన్న ఒవైసీ.. విజయం సాధించిన టీఆర్ఎస్‌కు అభినందనలు తెలిపారు.

మరోవైపు, బీజేపీపై ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడూ మోదీ హవాపైనే గెలవాలనుకుంటే కుదరదని అన్నారు. హర్యానాలో మోదీ 15 ర్యాలీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రగల్బాలు పలికినా చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మోదీ హవాను నమ్ముకోవడం మాని ఆర్థిక రంగంపైనా, గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాలని బీజేపీకి హితవు పలికారు.

More Telugu News