BJP: మహారాష్ట్రలో తగ్గిన బీజేపీ ప్రాభవం.. పుంజుకున్న శివసేన

  • గత ఎన్నికల్లో 122 స్థానాలను గెలుచుకున్న బీజేపీ
  • ప్రస్తుతం 98 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం
  • 24 సీట్లను కోల్పోనున్న బీజేపీ

మహరాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకోకుండానే బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం తగ్గింది. గత ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం 98 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా గత ఎన్నికలతో పోలిస్తే 24 సీట్లను బీజేపీ కోల్పోబోతోంది. మరోవైపు గత ఎన్నికల్లో శివసేన 63 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.

More Telugu News