pm: ఈ నెల 29న సౌదీ పర్యటనకు మోదీ

  • ఎఫ్ఐఐ వార్షిక సదస్సులో పాల్గొననున్న ప్రధాని
  • పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలకు అవకాశం
  • భారత్ లో సౌదీ పెట్టుబడులపై నిర్ణయం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఒకరోజు పర్యటన జరుపనున్నారు. ఈనెల 29న అక్కడ ప్రారంభం కానున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐఐ) వార్షిక సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సదస్సు 29 నుంచి 31వరకు కొనసాగనుంది. ఈమేరకు అధికార వర్గాలు వివరాలను తెలిపాయి.

ఈ పర్యటనలో ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ సందర్శించిన సమయంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News