నిఖత్ జరీన్ కు న్యాయం చేయండి.... కేంద్ర మంత్రికి లేఖ రాసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- టోక్యో ఒలింపిక్స్ లో నిఖత్ కు దక్కని అవకాశం
- ట్రయల్స్ లేకుండా మేరీకోమ్ ను పంపాలని బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం
- మేరీ కోమ్ తో తనకు పోటీ ఏర్పాటు చేయాలన్న నిఖత్ జరీన్
కాగా, ఎప్పుడూ 48 కిలోల కేటగిరీలో పాల్గొనే సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవలే 51 కిలోల విభాగానికి మారింది. దాంతో 51 కిలోల విభాగంలో పోటీపడే నిఖత్ కు అన్యాయం జరిగే పరిస్థితులు తలెత్తాయి. మేరీ కోమ్ సీనియారిటీ దృష్ట్యా ఆమెను ఎలాంటి సెలక్షన్ ట్రయల్స్ లేకుండానే ఇటీవల వరల్డ్ చాంపియన్ షిప్ కు పంపారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ కు కూడా సెలక్షన్ ట్రయల్స్ లేకుండానే మేరీని పంపేందుకు నిబంధనలు మార్చేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య సిద్ధపడింది.
దాంతో, ఈ విషయంపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు నిఖత్ జరీన్ లేఖ రాసింది. మేరీ కోమ్ తో తనకు పోటీ నిర్వహించాలని, విజేతను టోక్యో ఒలింపిక్స్ కు పంపాలని కోరింది. దీనిపై మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ నిఖత్ జరీన్ ఎవరు? అంటూ అవమానకరంగా మాట్లాడడంతో తెలుగు క్రీడావర్గాలు మండిపడ్డాయి.