Sushanrh: 'అల వైకుంఠపురములో' కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్.. ఫస్ట్ లుక్ ఇదిగో!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • సుశాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం
  • జనవరి 12న రిలీజ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రంలో మరో హీరో కూడా నటిస్తున్నాడు. యువ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ రిలీజ్ చేసింది. 'అల వైకుంఠపురములో' సినిమాలో సుశాంత్ పాత్ర పేరు రాజ్. "రాజ్ నవ్వితే ఎలాంటివాళ్లయినా ఆకర్షితులవ్వాల్సిందే" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.

బన్నీ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా, నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. సీనియర్ నటి టబు దశాబ్దకాలం తర్వాత ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.

More Telugu News