Jammu And Kashmir: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదుల హతం

  • అనంతనాగ్‌ జిల్లా శివారులో ఘటన
  • ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జల్లెడ పట్టిన సైన్యం
  • కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా శివారు ప్రాంతంలో ఈ రోజు  భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. అనంతనాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో  ఈరోజు ఉదయం ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పట్టాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేయించారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలుపు చేశారు.

అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఆ సమయంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగింది. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంటిలోకి ప్రవేశించారు. దీన్ని గమనించిన బలగాలు ఇంటిని చుట్టుముట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

More Telugu News