Suryapet District: మా అభ్యర్థి గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి చెందుతుంది: మంత్రి జగదీశ్ రెడ్డి

  • పద్మావతి గెలిస్తే వారి కుటుంబానికి ఓ పదవి వస్తుంది
  • ఆమెను గెలిపిస్తే ప్రజలకు ఏం లాభం ఉండదు
  • హుజూర్ నగర్ లో కేసీఆర్ సభకు ప్రజలు తరలి రావాలి

హుజూర్ నగర్ లో త్వరలో జరగబోయే ఉపఎన్నికలో తమ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని మంత్రి, అధికార పార్టీ నేత జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేటలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, అదే, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి గెలిస్తే వారి కుటుంబానికి ఓ పదవి వస్తుంది తప్ప ప్రజలకు ఏం లాభం ఉండదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవిలో ఉన్న సమయంలో ఏనాడూ నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నెల 17న హూజూర్ నగర్ లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు ప్రజలు తరలి రావాలని పిలుపు నిచ్చారు.

More Telugu News