Gambhir: ఇలాంటి సాహసాలు కోహ్లీ మాత్రమే చేయగలడు: గంభీర్

  • కోహ్లీ ఓటమిని లెక్కచేయడన్న గంభీర్
  • ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతాడని వెల్లడి
  • ఎక్కడైనా కోహ్లీ ఫార్ములా ఇదేనన్న గంభీర్

పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీని విమర్శించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈసారి బాణీ మార్చాడు. దక్షిణాఫ్రికాపై అమోఘమైన రీతిలో సిరీస్ విజయం సాధించిన నేపథ్యంలో కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఓడిపోతామన్న భయం లేకుండా బరిలో దిగడం కోహ్లీ ప్రత్యేకత అని కొనియాడాడు. ధోనీ, ద్రావిడ్, గంగూలీ కెప్టెన్లు ఎన్నో విజయాలు సాధించినా, వారిని మించి కోహ్లీ చరిత్ర సృష్టించాడని వెల్లడించాడు.

ఇతర సారథులు జట్టులో ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ ఉంటే సురక్షితంగా ఉంటుందని భావిస్తే కోహ్లీ మాత్రం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతాడని వివరించాడు. అది స్వదేశంలో అయినా విదేశంలో అయినా కోహ్లీ ఫార్ములాలో ఎలాంటి మార్పు ఉండదని గంభీర్ పేర్కొన్నాడు. ఇటువంటి సాహసాలు చేయగలిగేది కోహ్లీ మాత్రమేనని తెలిపాడు.

More Telugu News