బోటు వెలికితీతకు మరోసారి ప్రయత్నించనున్న ధర్మాడి సత్యం బృందం
- నెలరోజుల కిందట గోదావరిలో బోటు మునక
- ఇప్పటికీ గోదావరి గర్భంలోనే బోటు
- వెలికితీసేందుకు ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం
- మరోసారి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ను కోరిన ధర్మాడి సత్యం టీమ్
మూడ్రోజులపాటు శ్రమించినా కనీసం బోటు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేకపోయారు. అదే సమయంలో గోదావరికి మరోసారి వరద ఉద్ధృతి పెరగడంతో వెలికితీత ఆపరేషన్ నిలిపివేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి నెమ్మదించింది. ఈసారి ప్రయత్నించి బోటును తప్పకుండా వెలికితీస్తామని ధర్మాడి సత్యం బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి వెలికితీత పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.