Telangana: సీఎం పతనం మొదలైంది: టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలు

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం
  • వెనక్కి తగ్గని కార్మికులు
  • కఠిన వైఖరి కొనసాగిస్తున్న ప్రభుత్వం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం కూడా వెనక్కితగ్గడంలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైఖరి పట్ల టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే సీఎంకి పతనం మొదలైందని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వ్యవహారంలో అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోరాటం చేసి డిమాండ్లు సాధించుకుందామని ఆయన ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఎవరూ నిరాశకు లోనుకావద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

More Telugu News