శేఖర్ కమ్ముల మూవీ ఈ ఏడాదిలో రానట్టేనట!
- శేఖర్ కమ్ముల నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
- చైతూ సరసన సాయిపల్లవి
- ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన
ఈ సినిమాలో కథానాయకుడిగా చైతూ .. కథానాయికగా సాయిపల్లవి కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా కొన్నిరోజుల క్రితం శేఖర్ కమ్ముల చెప్పాడు. అయితే అనుకున్నట్టుగా ఈ సినిమా పనులు పూర్తికాకపోవడం వలన మరింత ఆలస్యమవుతుందనేది తాజా సమాచారం. డిసెంబర్ నాటికి షూటింగును .. జనవరిలో మిగతా పనులను పూర్తిచేసి, ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.