దసరా నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ట్వీట్... వైరల్!
- దాండియా ఆడుతున్న తండ్రీ కూతుళ్లు
- వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
- మరో ట్వీట్ లో చిన్నారుల దుర్గామాత ఫార్మేషన్
ఇక ఈ వీడియోకు 'దాండియా డాడీ' పోటీలకు ఇదొక ఎంట్రీనా ఏమిటీ? అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. "ఇంతకీ వీళ్లిద్దరూ తండ్రీ కూతుళ్ళా? బాగుంది.. అతను బాగానే పోటీ ఇస్తున్నాడు. అయినా నిజం చెప్పాలంటే, ఈ 'దాండియా డాటర్' మాత్రం పోటీల్లో కచ్చితంగా గెలుస్తుంది" అంటూ కామెంట్ పెట్టారు.
ఇదే సమయంలో మరో ట్వీట్ లో నలుగురు చిన్నారులు దుర్గామాత అవతారంలో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఇంతకన్నా అత్యుత్తమమైన మందిరాన్ని, విగ్రహాన్ని తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.