Sensex: వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు

  • 141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 48 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 8 పాయింట్లకు పైగా లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సంక్షోభ భయాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 11,126 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (8.19%), యాక్సిస్ బ్యాంక్ (2.53%), బజాజ్ ఆటో (1.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), భారతి ఎయిర్ టెల్ (0.53%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.49%), ఓఎన్జీసీ (-2.43%), ఐటీసీ (-2.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.76%).

More Telugu News