cm: ఎన్బీకే కార్యాలయం నుంచి అసభ్య ప్రచారం చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

  • జగన్ కుటుంబంపై దుష్ప్రచారం తగదు
  • ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశాం
  • టీడీపీ పెట్టిన పోస్టింగ్స్ ను మేము నిరూపిస్తాం

సీఎం వైఎస్ జగన్ కుటుంబంపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో టీడీపీ పెట్టిన అసభ్యకరమైన పోస్టింగ్స్ ను ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

హైదరాబాద్ లోని ఎన్బీకే కార్యాలయంలో రెండు వేల మంది పనిచేస్తూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పెట్టిన పోస్టింగ్స్ ను తాము నిరూపిస్తామని, ఈ విషయమై చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ద్వారా మభ్యపెట్టే కార్యక్రమాలు చంద్రబాబు ఆపాలని, ఆయన అకృత్యాలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్స్ ను ఖండిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News