TSRTC: ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్దకు వస్తే అరెస్టులు తప్పవు: డీసీపీ

  • ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు కఠిన వైఖరి
  • ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
  • ఇందిరా పార్క్ వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయంటున్న పోలీసులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు సరికదా, సీఎం కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా జేఏసీ నేతలు రేపు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టాలని భావించారు. అయితే, ఆర్టీసీ జేఏసీ నేతల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై డీసీపీ మాట్లాడుతూ, ఆర్టీసీ జేఏసీ దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఆంక్షలు అమలులో ఉన్నాయని, ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్దకు వస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు.

More Telugu News