యువ నటిని వెంటేసుకుని శ్రీలంక పారిపోయిన లలితా జ్యూయలర్స్ దొంగ!

- ప్రధాన నిందితుడు మురుగన్
- రూ. 10 కోట్ల బంగారంతో లంకకు పరారీ
- కొలంబోకు ప్రత్యేక పోలీసు బృందాలు
ప్రధాన నిందితునిగా భావిస్తున్న తిరువారూరుకు చెందిన మురుగన్ మాత్రం ఇంకా దొరకలేదు. అతను హెచ్ఐవీతో బాధపడుతున్న రోగని కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇతని వలలో సదరు హీరోయిన్ ఎలా పడిందన్న విషయం మాత్రం తెలియడం లేదు.
కాగా, కోటీశ్వరుడైన మురుగన్ కు చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయని గుర్తించారు. గతంలో మురుగన్ కొన్ని సినిమాలను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. మురుగన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను శ్రీలంక పంపుతున్నామని, అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.