పోలీసు భద్రత ఉన్నప్పటికీ.. టీఎస్ఆర్టీసీ బస్సు ధ్వంసం
- వికారాబాద్ డిపోకు చెందిన బస్సుపై దాడి
- దాడిలో పగిలిన బస్సు ముందు వైపు అద్దాలు
- ఆర్టీసీ ఉద్యోగులే దాడి చేసి ఉంటారని అనుమానం
వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్ కు వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ... మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.