Telangana: చర్చలు విఫలం.. ఈరోజు అర్ధరాత్రి నుంచి టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె!

  • టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
  • ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ ల కమిటీ చర్చలు విఫలం
  • కార్మికుల డిమాండ్లకు అంగీకరించని కమిటీ

టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ ల కమిటీ ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు ఐఏఎస్ ల కమిటీ అంగీకరించలేదని, దీంతో, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్టు సమాచారం. ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెకు పిలుపు నివ్వనున్నట్టు తెలుస్తోంది.

 కాగా, దసరా పండగ కోసం ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతామని టీఎస్సార్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ప్రత్యేక బస్సుల సంగతి అటుంచి, రెగ్యులర్ గా తిరిగే బస్సులైనా తిరుగుతాయో లేదో అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

More Telugu News