Polavaram: పోలవరం ఎడమకాలువ ప్యాకేజీ-5 పనులు రద్దు

  • రివర్స్‌ టెండరింగ్‌ వైపు వైసీపీ ప్రభుత్వం
  • రూ.65 కోట్ల విలువైన టెండర్‌ ఇది
  • త్వరలో కొత్త ఏజెన్సీలకు పనులు

ప్రతిపక్ష టీడీపీ ఎంతగా విమర్శిస్తున్నా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలనుకుంటున్న జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పోలవరం టెండర్లలో మరోదాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ప్యాకేజీ-5లో 65 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎస్కే-హెచ్‌ఈఎస్‌ ఇన్ఫ్రా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్న పనులకు అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లింపులు చేయనుంది. అనంతరం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించేందుకు వీలుగా టెండర్‌ ప్రక్రియను నిర్వహించనుంది.

More Telugu News