Mahatma Gandhi: మహాత్ముడికి బుర్జ్ ఖలీఫా ఘన నివాళి.. వీడియోతో అదుర్స్!

  • మహాత్మాగాంధీ 150వ జయంతి
  • ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫా
  • భవనంపై గాంధీ చిత్రం ప్రదర్శన

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వినూత్నంగా నివాళి అర్పించింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడమైన ఈ భవనంపై లైటింగ్‌తో గాంధీ, త్రివర్ణ పతాక చిత్రాలను ప్రదర్శించారు. వాటిని ప్రదర్శిస్తూ గాంధీకి ఎంతో ఇష్టమైన ‘వైష్ణవ జనతో’పాటను బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే చేశారు. వివిధ కాంతుల్లో మెరిసిన గాంధీ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోను పోస్టు చేసిన బుర్జ్ ఖలీఫా.. అహింస మార్గంలో ప్రపంచాన్నే కుదిపేయొచ్చు అని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడండి.

More Telugu News