Vizag Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. జట్ల వివరాలు

  • విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు
  • భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్
  • టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులు

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత డ్యాషింగ్ బ్యాట్సెమెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లో భారత్ 9 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4, మయాంక్ అగర్వాల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇరు జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.

దక్షిణాఫ్రికా: మార్క్ రమ్, డీన్ ఎల్గర్, డి బ్రూన్, బువుమా, డూప్లెసిస్, డీకాక్ (కీపర్), ఫిలాండర్, ముత్తుసామి, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, డేన్ పైత్.

More Telugu News