Janasena: యురేనియం డ్రిల్లింగ్ పనుల గురించి ఏపీ ప్రభుత్వానికి తెలియదా?: పవన్ కల్యాణ్

  • ఆళ్ళగడ్డలో యురేనియం డ్రిల్లింగ్ పనులు
  • దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్
  • ఈ విషయమై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టు వస్తున్నవార్తల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవా? అని ప్రశ్నించారు.

ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలకు మద్దతు ఇచ్చేందుకు, వారితో కలిసి పోరాడేందుకు తాము ఉన్నామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ కోసం విమలక్క పాడిన పాట వీడియోతో పాటు యురేనియం డ్రిల్లింగ్ పనులకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

More Telugu News