హౌడీ-మోదీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్: ప్రధాని మోదీ

  • ముగిసిన మోదీ అమెరికా పర్యటన
  • అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన మోదీ
  • ఢిల్లీలో ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, తన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడికి తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగొచ్చిన సందర్భంలో ఈ ఘనస్వాగతం మరువలేనిదని పేర్కొన్నారు.

2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఓసారి ఐక్యరాజ్యసమితికి వెళ్లానని, ఇప్పుడు మరోసారి వెళ్లానని, ఈ ఐదేళ్లలో పెద్దమార్పు చూశానని మోదీ వివరించారు. అమెరికాలో నిర్వహించిన హౌడీ-మోదీ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. హూస్టన్ లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా దేశప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Narendra Modi
USA
New Delhi
BJP

More Telugu News