మద్యం మత్తులో నడిరోడ్డుపై బైఠాయించి మహిళ వీరంగం.. సీఐపై ఆరోపణలు
- డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన డ్రైవర్
- కారును సీజ్ చేసిన పోలీసులు
- ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మహిళ
పోలీసులు కారును సీజ్ చేయడంతో కిందికి దిగిన పద్మ, శ్రీనులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పద్మ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. సీజ్ చేసిన కారును విడిచిపెట్టేందుకు సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ 5 వేల రూపాయల లంచం అడిగారని పద్మ ఆరోపించింది. అక్కడితో ఆగక తన వద్ద అంత డబ్బు లేదని చెబుతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. డ్రైవర్ మద్యం తాగలేదని, తాము మాత్రమే తాగామని శ్రీను తెలిపాడు. కాగా, పద్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు. విధులకు ఆటంకం కలిగించినందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.