Telangana: సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు

  • దురాజ్‌పల్లిలో ఘటన
  • ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడిన బస్సు
  • క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

సూర్యాపేటలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పట్టణ శివారులోని దురాజ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. విశాఖ నుంచి హైదరాబాదుకు వస్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News