Pakistan: భూకంపం ధాటికి పాకిస్థాన్ లో 15 మంది మృతి

  • పాకిస్థాన్ లో భూకంపం  
  • లాహోర్ కు వాయవ్య దిశలో భూకంప కేంద్రం
  • భారత్ లోనూ ప్రకంపనలు

లాహోర్ కు వాయవ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం పాకిస్థాన్ ను వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి పాక్ లో 15 మంది వరకు మరణించారు. 150 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి, భయకంపితులైన ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ పలు చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

More Telugu News