Ameerpet: అమీర్ పేట మెట్రో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • సిమెంటు పెచ్చులు పడి మౌనిక అనే యువతి మృతి
  • మృతురాలి భర్త ఫిర్యాదు
  • సెక్షన్ 174 కింద కేసు నమోదు

హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వర్షం నుంచి తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ కింద నిలుచున్న మౌనిక అనే యువతిపై సిమెంటు పెచ్చులు పడ్డాయి. దాంతో ఆమె మృతి చెందింది. ఈ నేపథ్యంలో, ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే సెక్షన్ 304(A) కింద విచారణ జరిపే అవకాశాలున్నాయి. ఈ కేసులో బాధ్యులైన వారందరినీ విచారిస్తామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు.

More Telugu News