అంతా బాగుందంటూ తెలుగులో మాట్లాడిన మోదీ.. కరతాళ ధ్వనులతో హోరెత్తిన హ్యూస్టన్ సభ

  • హ్యూస్టన్‌లో మోదీకి ఘన స్వాగతం
  • తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని
  • ట్రంప్‌పై పొగడ్తల వర్షం
అమెరికాలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరైన ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. అంతా బాగుందని తెలుగులో చెప్పడంతో తెలుగువారు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. తెలుగుతోపాటు మరిన్ని భాషల్లోనూ మాట్లాడిన మోదీ.. హ్యూస్టన్‌లో తనకు అపూర్వ స్వాగతం లభించిందన్నారు.

ఈ సందర్భంగా హ్యూస్టన్ వాసులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ట్రంప్ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరన్న మోదీ.. ప్రతి పదిమంది సంభాషణల్లోనూ ట్రంప్ పేరు వినిపిస్తుందని అన్నారు. వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింటా ఆయన పేరు వినిపిస్తుందన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Donald Trump
houston
NRI

More Telugu News