Andhra Pradesh: హైదరాబాద్ లో రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

  • ప్రగతి భవన్ లో జగన్, కేసీఆర్ భేటీ
  • గోదావరి జలాల తరలింపు ప్రధాన అజెండా
  • గతంలోనూ ఇదే అంశంపై చర్చించిన సీఎంలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ రేపు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరిగే ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించనున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇటీవలే జగన్, కేసీఆర్ గోదావరి తరలింపుపై చర్చలు జరపగా, అందుకు కొనసాగింపుగా రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజినీర్ల బృందాలు సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలు రూపొందించాయి. ఇప్పుడా ప్రతిపాదనలపై సీఎంలిద్దరూ ఓ నిర్ణయం తీసుకుంటారు.

More Telugu News