Varun: విడుదలకి సిద్ధమైపోయిన 'వాల్మీకి'

  • ప్రధాన పాత్రల్లో వరుణ్ - అధర్వ 
  • తెలుగు తెరకి మృణాళిని రవి పరిచయం 
  • స్పెషల్ సాంగులో డింపుల్ హయాతి

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ .. అధర్వ మురళి ప్రధాన పాత్రలుగా 'వాల్మీకి' రూపొందింది. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ' చిత్రానికి ఇది రీమేక్. పూజా హెగ్డే .. మృణాళిని రవి కథానాయికలుగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. 2 గంటల 53 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ తేజ్ లుక్ కి .. పూజా హెగ్డే గ్లామర్ కి ఇప్పటికే మంచి మార్కులు పడిపోయాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రీకరించిన 'దేవత' సినిమాలోని పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో డింపుల్ హయాతి మెరవనుంది.

More Telugu News