Tharun Bhaskar: 'మీకు మాత్రమే చెప్తా' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • విభిన్న కథా చిత్రంగా 'మీకు మాత్రమే చెప్తా'
  • సంగీత దర్శకుడిగా శివకుమార్
  • కీలక పాత్రలో అనసూయ

ఒక వైపున హీరోగా దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ, నిర్మాతగా మారి, 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి, షమీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
 
'ఏ ఎందుకు వై ఇలా .. నాకు మాత్రం ఎందుకిలా .. తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా?" అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వీడియో గేమ్ తరహా యానిమేషన్ విజువల్స్ తో ఈ సాంగ్ ను అందించారు. శివకుమార్ సంగీతం .. రాకేందుమౌళి సాహిత్యం .. హేమచంద్ర - కృష్ణన్ గణేశన్ ఆలాపనతో ఈ పాట సాగింది. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. నిర్మాతగా విజయ్ దేవరకొండ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.

More Telugu News