Hindi: ‘హిందీ’ని బలవంతంగా రుద్దాలని చూస్తే తమిళ ప్రజలు అంగీకరించరు: కార్తీ చిదంబరం

  • దేశాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి ‘హిందీ’కి లేదు
  • డీఎంకే నిర్వహించనున్న నిరసనల్లో మేమూ పాల్గొంటాం
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కార్తీ చిదంబరం

‘హిందీ’ని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘హిందీ’ని బలవంతంగా రుద్దే ఎలాంటి ప్రయత్నాలను తమిళ ప్రజలు అంగీకరించని అన్నారు. దేశాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి ఈ భాషకు లేదని విమర్శించారు. ఈ నెల 20న తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొంటామని పేర్కొన్నారు.

More Telugu News