Andhra Pradesh: చంద్రబాబు టీడీపీని ఓ సర్కస్ ట్రూపులా మార్చాడు.. జనాలు పోగవగానే షో మొదలవుతుంది!: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు ఓ చోట టెంట్ వేస్తాడు
  • ప్రజలను చూసి ఓటేస్తారని హుషారైపోతాడు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఓ సర్కస్ ట్రూపుగా మార్చేశారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఓ చోట టెంటు వేస్తారనీ, జనం పోగవగానే షో మొదలవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సర్కస్ కు వచ్చినవాళ్లంతా తనకు ఓటేసినట్టేనని చంద్రబాబు హుషారై పోతారనీ, కానీ సర్కస్ చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన సాయిరెడ్డి, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలను ట్యాగ్ చేశారు.

More Telugu News