Narendra Modi: మోదీ ఫొటోకు దండ వేసిన బీజేపీ ఎంపీ.. తీవ్ర విమర్శలు

  • మోదీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ఎంపీ చంద్రసేన్
  • అత్యుత్సాహంతో మోదీ ఫొటోకు దండ వేసిన వైనం
  • పుట్టినరోజు వేడుకలు ఎలా చేయాలో తెలుకోవాలంటూ ప్రతిపక్షాల విమర్శలు

ప్రధాని మోదీ నిన్న తన 69వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమెతో కలసి భోజనం చేశారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించాయి. అయితే, ఓ బీజేపీ ఎంపీ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్ర విమర్శలపాలయ్యారు.

 ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ చంద్రసేన్ జాదౌన్...  ఫిరోజాబాద్ లోని సిర్సాగంజ్ పట్టణంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి ఆయన పూలమాల వేశారు. దీంతో, అక్కడున్న నేతలంతా షాక్ కు గురయ్యారు. ఎంపీ చేసిన పనికి ఆవేదన చెందారు. ఆయన చేసిన పనిని తప్పుబట్టారు. ఆ తర్వాత చంద్రసేన్ చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఎంపీపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలను ఎలా చేయాలో ముందు తెలుసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.

More Telugu News